రైతులకు ధరల షాక్.. మామిడి ప్రియులకు పండగే
రైతులకు ధరల షాక్.. మామిడి ప్రియులకు పండగే
mango-prices-have-fallen-sharply-546412


కర్నూలు, 04 మే (హి.స.)ఆంధ్రప్రదేశ్లో మామిడి ధరలు కుప్పకూలాయి. తోతాపురి, బంగినపల్లి రకాల ధరలు లక్షల నుండి వేలల్లోకి పడిపోవడంతో రైతులు నష్టపోతుండగా, మామిడి ప్రియులకు మాత్రం పండ్లు చౌకగా లభిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లో మామిడి ధరలు (Mango prices) భారీగా పతనం కావడం అటు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలించగా, ఇటు మామిడి ప్రియులకు మాత్రం తీపి కబురును అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర ₹1.10 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం అది ఊహించని విధంగా ₹4-7 వేలకు పడిపోయింది. అదేవిధంగా అత్యంత నాణ్యమైన బంగినపల్లి మామిడి ధర ₹1.75 లక్షల నుంచి ₹50-60 వేలకు కుప్పకూలింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎగుమతులు నిలిచిపోవడం, దేశంలో డీజిల్ కొరత, వ్యాపారులు సిండికేట్గా మారడం వంటి కారణాల వల్ల ధరలు ఇంతలా పతనమయ్యాయని తెలుస్తోంది.

ఎగుమతులు ఆగిపోయి స్థానిక మార్కెట్లకు మామిడి నిల్వలు పోటెత్తడంతో, మామిడి ప్రియులకు మాత్రం తక్కువ ధరకే పండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది వినియోగదారులకు శుభవార్తే అయినప్పటికీ, సాగు కోసం చేసిన కనీస పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు లక్షల్లో పలికిన ధరలు ఇప్పుడు వేలల్లోకి చేరడం మామిడి సాగుదారుల ఆర్థిక పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande