విజయ్ విజయం కోసం.. తిరుమల శ్రీవారిని మొక్కుకున్న త్రిష
విజయ్ విజయం కోసం.. తిరుమల శ్రీవారిని మొక్కుకున్న త్రిష
trisha-visited-tirumala-temple-for-tvks-victory-5464


తిరుమల , 04 మే (హి.స.)

ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, స్వామివారి ఆశీస్సుల కోసం ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి, దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. తన పుట్టినరోజు నాడే స్వామివారిని దర్శించుకోవడం పట్ల త్రిష సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజే వెల్లడవుతుండటం విశేషం. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఆమె శ్రీవారిని మొక్కుకున్నట్లు సమాచారం. విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలో, ఆయన రాజకీయ రంగప్రవేశం విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించినట్లు తెలుస్తోంది.

ఇక ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ విషయానికి వస్తే, ఉదయం 10 గంటల సమయానికి తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఏకంగా 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఇది చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, ప్రధాన పార్టీలైన ఏఐడీఎంకే 74 స్థానాల్లో, అధికార డీఎంకే 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో టీవీకే పార్టీ మొదటి స్థానంలో కొనసాగుతుండటంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర ఖాయమనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande