భారత షూటింగ్ దిగ్గజం, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
భారత షూటింగ్ దిగ్గజం, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత
jais


న్యూఢిల్లీ, 12 జూన్ (హి.స.)రత షూటింగ్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ షూటర్ మరియు హై-పెర్ఫార్మెన్స్ కోచ్ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో కన్నుమూశారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయన్ను సాకేత్లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు స్టెంట్ సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జూన్ 11, 2026 రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా ప్రముఖులు మరియు జాతీయ రైఫిల్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని, సెంతాపాన్ని వ్యక్తం చేశారు.జస్పాల్ రాణా భారత క్రీడా చరిత్రలో అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యధికంగా 15 పతకాలు (9 స్వర్ణాలు) సాధించిన రికార్డు ఆయన పేరిట ఉంది. అలాగే ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచిన ఆయన, 1994లో అర్జున అవార్డు మరియు 1997లో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. క్రీడాకారుడిగా రిటైర్ అయిన తర్వాత ఆయన అద్భుతమైన కోచ్గా మారారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించడంలో రాణా కీలక పాత్ర పోషించారు. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి ప్రపంచ స్థాయి షూటర్లను దేశానికి అందించినందుకు గానూ ఆయనకు 2020లో ద్రోణాచార్య అవార్డు లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande