33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని
33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని
Prime Minister Modi gave a message of nature and prosperity


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐరోపా పర్యటనలో భాగంగా ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. 33 ఏళ్లలో తొలిసారిగా ఒక భారత ప్రధాని స్లోవేకియాలో అడుగుపెట్టారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం ఆయన స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్నారు. స్లోవేకియాకు 1993లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.

బ్రాటిస్లావా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ సంప్రదాయబద్ధంగా 'బ్రెడ్ అండ్ సాల్ట్'తో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ 'ఎక్స్' వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని రాబర్ట్ ఫికోలతో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, అక్కడి అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రక్షణ, ఆటోమొబైల్, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1.6 బిలియన్ యూరోల వాణిజ్యం ఉంది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చల నేపథ్యంలో ఈయూ, నాటో సభ్యదేశమైన స్లోవేకియాతో బంధం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పర్యటన ముగించుకుని మోదీ తిరిగి ఫ్రాన్స్ వెళ్తారు. అక్కడ జూన్ 16, 17 తేదీలలో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం పారిస్లో జరిగే 'వివాటెక్ 2026' టెక్నాలజీ ఈవెంట్కు హాజరై ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande