మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ
మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ
rana


హైదరాబాద్, 17 జూన్ (హి.స.)

భారతీయ శౌర్యం, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమైన వీర శిరోమణి మహారాణా ప్రతాప్ 486వ జయంతి (హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుక్ల పక్ష తృతీయ తిథి) వేడుకలను రాజస్థాన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆ మహోన్నత వీరునికి ఘన నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక గౌరవ సమ్మాన్ కార్యక్రమాల్లో సీఎం పాల్గొని, ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాతృభూమి రక్షణ, స్వేచ్ఛ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహారాణా ప్రతాప్ జీవితం.. సత్యం, ధర్మం మరియు దేశహితం కోసం పోరాడేందుకు నేటికీ కోట్లాది మందికి నిరంతర ప్రేరణ ఇస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శాలను అలవర్చుకుని, రాష్ట్ర ప్రగతి కోసం దేశసేవకు పునరంకితం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande