
ఢిల్లీ 18 జూన్ (హి.స.)
శివసేన (యుబిటి) పార్టీ భవిష్యత్తును తేల్చేందుకు, లోక్సభ ఎంపీల తిరుగుబాటును అణచివేసేందుకు పార్టీ అధిష్టానం జూన్ 18, 2026 గురువారం నాడు ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఈ పార్టీకి చెందిన మొత్తం 9 మంది లోక్సభ ఎంపీలలో ఆరుగురు విడిపోయేందుకు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా తప్పించుకోవడానికి ఈ ఆరుగురు ఎంపీల సంఖ్య చాలా కీలకం కానుంది. వీరంతా స్వతంత్ర సమూహంగా ఏర్పడి, ఆ తర్వాత ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో విలీనం కావాలని భావిస్తున్నట్లు సమాచారంప్రస్తుతం అనిల్ దేశాయ్, రాజభావు వాజే, అరవింద్ సావంత్ మాత్రమే ఉద్ధవ్ క్యాంప్కు తమ మద్దతును స్పష్టం చేశారు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ అధిష్టానం బుధవారం ఎంపీలందరికీ తప్పనిసరిగా హాజరుకావాలంటూ త్రీ-లైన్ విప్ జారీ చేసింది ఈ సమావేశానికి గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు మరోవైపు, తిరుగుబాటు వర్గానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వవద్దని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనను వినాలని సంజయ్ రౌత్, అరవింద్ సావంత్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ముందస్తు లేఖ సమర్పించారు . కాగా, తిరుగుబాటు ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు .ధైర్యం ఉంటే పార్టీ మారకుండా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన అసమ్మతి నేతలకు సవాలు విసిరారు
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi