ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత
ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత
ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరినట్లు వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ స్పష్టతనిచ్చారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు నిన్న సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. బెర్హంపూర్ లోక్సభ స్థానానికి నేను రాజీనామా చేయాలని, తద్వారా మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మమతా బెనర్జీ నాతో ఎప్పుడూ చర్చించలేదు. పార్టీలోని ఏ ఒక్క నాయకుడు కూడా నన్ను రాజీనామా చేయమని అడగలేదు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని యూసుఫ్ పఠాన్ తన వీడియోలో పేర్కొన్నారు.

2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసిన యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఆయన ఓడించారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కోసం పఠాన్ తన సీటును త్యాగం చేయాల్సి వస్తుందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తాజా ప్రకటనతో తెరపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande