
కలకత్తా, 08 జూన్ (హి.స.)
పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాల్లో ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్ల నుండి దాదాపు 4,800 మంది అక్రమ వలసదారులను బంగ్లాదేశ్కు పంపించివేసినట్లు, మరో 836 మందిని డిపోర్టేషన్ (స్వదేశానికి పంపడం) కోసం ప్రస్తుతం ఆయా కేంద్రాలలో నిర్బంధించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం భారత పౌరసత్వానికి అర్హత సాధించని ఈ వ్యక్తులను, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వదేశానికి పంపేందుకు సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించారు.రాష్ట్ర సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, బీఎస్ఎఫ్కు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు కంచె వేయడానికి అవసరమైన మొత్తం 556 కిలోమీటర్ల పరిధిలో, ఉత్తర బెంగాల్లోని వ్యూహాత్మక సిలిగురి కారిడార్ (చికెన్స్ నెక్) పై ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే 100 కిలోమీటర్ల మేర భూమిని అప్పగించారు. చారిత్రక లోపాలను సవరించడంలో భాగంగా రాష్ట్రంలో జనాభా ట్రాకింగ్ విధానాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు అధికారికంగా ప్రతి ఇంటికీ వెళ్లి అక్రమ వలసదారులను గుర్తించే సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi