ఓమన్ తీరంలో భారతీయ నౌకపై క్షిపణి దాడి: 24 మంది సిబ్బంది సురక్షితం
ఓమన్ తీరంలో భారతీయ నౌకపై క్షిపణి దాడి: 24 మంది సిబ్బంది సురక్షితం
oman


ఢిల్లీ,, 09 జూన్ (హి.స.)

ఓమన్ తీరంలో క్షిపణి దాడికి గురైన ఎంటీ మారివెక్స్ అనే వ్యాపార నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ నౌకాదళం విజయవంతంగా రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ ప్రకటించింది. మసిరా ద్వీపానికి సమీపంలో లంగరు వేసి ఉన్న ఈ పలావు జెండా గల ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్ గదిపై క్షిపణి దూసుకురావడంతో నౌకలో మంటలు చెలరేగి అది నియంత్రణ కోల్పోయింది. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అప్రమత్తమై ఒమన్ అధికారులకు సమాచారం అందించగా వారు రెండు హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande