
ఢిల్లీ, 22 జూలై (హి.స.)
జాతీయ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 10 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేశారు. న్యూఢిల్లీ జిల్లా పరిధిలో జరిగిన నిరసనల సమయంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
నమోదైన కేసుల వివరాల ప్రకారం:
-
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్: 4 ఎఫ్ఐఆర్లు
-
కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్: 3 ఎఫ్ఐఆర్లు
-
మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్: 1 ఎఫ్ఐఆర్
-
బారాఖంబా రోడ్ పోలీస్-స్టేషన్: 1 ఎఫ్ఐఆర్
-
కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్: 1 ఎఫ్ఐఆర్
సోమవారం న్యూఢిల్లీ ప్రాంతంలో సిజేపి నిర్వహించిన ఆందోళనలో నిరసనకారులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయి, హింసాత్మకంగా ప్రవర్తించారని అధికారులు తెలిపారు. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళనకారులు రచ్చ సృష్టించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన రాళ్లదాడి, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, పోలీసులపై దాడికి సంబంధించి ఇప్పటికే భారతీయ నస్య సంహిత (BNS), ఆర్మ్స్ యాక్ట్, మరియు ప్రభుత్వ ఆస్తుల నష్ట నిరోధక చట్టం క్రింద కేసులు నమోదయ్యాయి.
అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా న్యూఢిల్లీ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేసినందుకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాగా, హింస వెనుక ఏదైనా ముందస్తు కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిరసనకు సంబంధించిన 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi