తేదీ తప్పుగా చెప్పారు నడ్డా గారు.. ఆ పేపర్ లీక్ జరిగింది మీ ఎల్జీ పాలనలోనే: జేపీ నడ్డా ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం ఒమర్ అబ్దుల్లా
తేదీ తప్పుగా చెప్పారు నడ్డా గారు.. ఆ పేపర్ లీక్ జరిగింది మీ ఎల్జీ పాలనలోనే: జేపీ నడ్డా ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah


జమ్మూ కాశ్మీర్, 23 జూలై (హి.స.)

జమ్మూ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (JKSSB) పేపర్ లీక్ వివాదానికి సంబంధించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. బుధవారం నాటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జేపీ నడ్డా మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) - కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ పేపర్ లీక్ జరిగిందని, దీనిపై వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనికి 'X' (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా, నడ్డా గారు మీరు తేదీని పూర్తిగా తప్పుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద పేపర్ లీక్ సంఘటన జరిగింది 2022లోనని, ఆ సమయంలో అక్కడ తమ ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని లెఫ్టినెంట్ గవర్నర్ (LG) పాలన సాగుతోందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశాల ప్రకారం అప్పట్లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఏమైందో, దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తదుపరి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనైనా జేపీ నడ్డా వెల్లడించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande