పండరీపురంలో ముగిసిన 'వారీ యాత్ర'; చంద్రభాగా నది తీరంలో లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలు
పండరీపురంలో ముగిసిన 'వారీ యాత్ర'; చంద్రభాగా నది తీరంలో లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలు
pandarpur


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

మహారాష్ట్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక 'పండరీపుర వారీ యాత్ర' ఆషాఢ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం (జూలై 25) వైభవంగా ముగిసింది. విఠోబా (శ్రీకృష్ణుడు) మహారాజ్‌ను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి వచ్చిన లక్షలాది మంది 'వార్కరీ' (యాత్రికులు) పండరీపురంలోని చంద్రభాగా నదీ తీరానికి పోటెత్తారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం భక్తులు చంద్రభాగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సుదీర్ఘ కాలినడక యాత్ర ఈ ఏడాది జూలై 7న ప్రారంభమై, నేటితో ముగిసిందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్, అలాగే ముంబై మేయర్ రీతూ తావ్డే శనివారం ఉదయం శ్రీ విఠల్-రుక్మిణి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక మహాపూజలు నిర్వహించారు. ఈసారి మునుపటి రికార్డులన్నీ బద్దలయ్యేలా ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భారీ విపత్తు నిర్వహణ ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు జూలై 13న పుణె జిల్లా పరిధిలో యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రక్కు.. కాలినడకన వెళ్తున్న మరో గ్రూపు భక్తులను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళా భక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడిన విషాద ఘటనను పోలీసులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

--------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande