
ఇంఫాల్, 08 జూలై (హి.స.)
మణిపూర్లో ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో అమరులైన ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఘన నివాళులు అర్పించారు. ఇంఫాల్లో జరిగిన ప్రత్యేక శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆయన పాల్గొని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల పార్థివ దేహాలపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... జవాన్ల త్యాగాలు వృధా పోవని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదులను, సాయుధ ముఠాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ దాడిని అత్యంత పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సైనిక సిబ్బంది కూడా పాల్గొని జవాన్లకు తుది వీడ్కోలు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi