
న్యూఢిల్లీ, 10 ఆగస్టు (హి.స.)
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలపై అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న విమర్శలను మరియు అమెరికన్ చట్టసభల ఆందోళనలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది .. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ క్వాతా ఈరోజు వాషింగ్టన్లో మాట్లాడుతూ, ఎఫ్సిఆర్ఏ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు కేవలం దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి మరియు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను పెంచడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. అమెరికాలోనే ఇలాంటి కఠినమైన విదేశీ నిధుల నియంత్రణ చట్టాలు అమల్లో ఉన్నాయని, భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలు మరియు చర్చిలను నియంత్రించడానికి ఈ చట్టాన్ని వాడుతున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా న్యూఢిల్లీలో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించడం మరియు గతంలో జరిగిన ఎంపీల సస్పెన్షన్ల వంటి చర్యలను పునరావృతం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం రాజకీయంగా వేడిని పెంచింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi