
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రుల ప్రసంగాలపై స్థానిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు, లబ్ధిదారులకు పట్టాల పంపిణీ నిమిత్తం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పనులను అసంపూర్తిగా వదిలేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తోందని వారు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi