అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
ap


అమరావతి, 10 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి పెట్టుబడి సహాయం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అన్నదాత సుఖీభవ' (పిఎం కిసాన్ అనుసంధాన) పథకం మొదటి విడత నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నేరుగా నగదు జమ (DBT) చేసేందుకు వీలుగా లబ్ధిదారుల తుది జాబితా రూపకల్పన ప్రక్రియను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. గతంలో సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి క్షేత్రస్థాయి సిబ్బందికి గడువు విధించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుందని, అర్హులైన ఏ ఒక్క రైతు కూడా జాబితా నుండి తొలగించబడకుండా పారదర్శకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande