
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంలో ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటన నేపథ్యంలో, వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించి ఓదార్చడానికి కేసీఆర్ ఈరోజు వరంగల్కు చేరుకుంటున్నారు.పార్టీ అధినేత రాకను పురస్కరించుకుని గులాబీ శ్రేణులు వరంగల్ నగరంతో పాటు నరసంపేట రహదారుల పొడవునా భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు.ఇటీవలి కాలంలో కేసీఆర్ పర్యటనల్లో ఇది అత్యంత కీలకమైనది కావడంతో, ఈ పరామర్శ పర్యటనను బీఆర్ఎస్ శ్రేణులు తమ రాజకీయ బలాన్ని నిరూపించుకునేలా భారీ మోబిలైజేషన్గా మార్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi