విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల మహా ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల మహా ధర్నా
vishakha


విశాఖపట్నం 10 ఆగస్టు (హి.స.)

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఉక్కు కర్మాగారం) పరిరక్షణే ధ్యేయంగా కార్మిక సంఘాలు మరియు నిర్వాసిత జేఏసీ (JAC) ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ముందు భారీ నిరసన ప్రదర్శన మరియు మహా ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని మరియు నిధుల కొరతను తీర్చడానికి తక్షణ ప్యాకేజీని ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉక్కు నగరం పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విశాఖ నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande