భద్రాచలం వద్ద నిలకడగా ఉన్న గోదావరి నది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం వద్ద నిలకడగా ఉన్న గోదావరి నది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
bhadrachalam


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: , 12 ఆగస్టు (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం నిన్న రాత్రి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టి నిలకడగా కొనసాగుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ఈరోజు ఉదయం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 41 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. అయినప్పటికీ, ముంపు ప్రాంతాల ప్రజలు ఇంకా కొన్ని రోజుల పాటు అప్రమత్తంగానే ఉండాలని అధికారులు సూచించారు. కడలి వెంబడి ఉన్న స్నానఘట్టాల వద్ద భద్రతా సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన కాలనీల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని స్థానిక గ్రామ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande