జడ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో కొత్త ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ
జడ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో కొత్త ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ
జడ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో కొత్త ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ


, 12 ఆగస్టు (హి.స.)

మహబూబ్‌నగర్ జిల్లా:

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఒక ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ నూతన తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఉదయం కంపెనీ ప్రతినిధులు మరియు స్థానిక అధికారులు సంయుక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న రాత్రి ఇందుకు సంబంధించిన తుది పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం చేశారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు ద్వారా జిల్లాలోని సుమారు 800 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. కాలుష్య నివారణకు గాను అత్యాధునిక జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) సాంకేతికతను ఇక్కడ వాడుతున్నట్లు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande