సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిన భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులు హతం
సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిన భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులు హతం
terrorist


శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్:, 12 ఆగస్టు (హి.స.)

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రేఖ వెంబడి భారత సైన్యం నిన్న అర్ధరాత్రి వేళ మరోసారి తమ శౌర్యాన్ని ప్రదర్శించింది. శ్రీనగర్ పరిసర రక్షణ వలయంలోని కుప్వారా సెక్టార్ ద్వారా దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదుల కుట్రను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. దట్టమైన పొగమంచు మరియు చీకటిని ఆసరాగా చేసుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న సాయుధ ఉగ్రవాదులను గస్తీ తిరుగుతున్న భారత జవాన్లు గుర్తించారు. లోపలికి రావద్దని హెచ్చరించినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో, సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, చైనా తయారీ గ్రెనేడ్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోననే అనుమానంతో సైన్యం ఉదయం నుంచి ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande