
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని ఆస్మాన్ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ జయనగర్ ఫీడర్ పరిధిలోని సైదాబాద్ కాలనీ, మెయిన్ రోడ్డు, రామాలయం, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, లక్ష్మీనగర్, సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, ధోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్