
అమరావతి, 14 ఆగస్టు (హి.స.)
=,పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాల తరలింపుతో సహా 35 ప్రాధాన్య ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ