
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పీపల్కోటి వద్ద ఉన్న టిహెచ్డిసి (THDC) జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న సొరంగంలో భారీగా నీరు, బురద చేరడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది గాయపడ్డారు.
సొరంగంలో పనులు జరుగుతున్న సమయంలో కొండచరియలు విరిగిపడటంతో నీరు, వ్యర్థాలు లోపలికి చేరుకుని దాదాపు 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డిఆర్ఎఫ్ (SDRF), ఐటిబిపి (ITBP), ఆర్మీ మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
సొరంగం లోపల నుంచి నీటిని బయటకు తోడేందుకు పంపులు, బురదను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇంకా లోపల చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.
ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా పీపల్కోటి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. గాయపడిన వారికి గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi