గ్రేటర్ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్కార్డులు
డిజిటలైజేషన్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్ స్మార్ట్కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.
Smart cards


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) డిజిటలైజేషన్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్ స్మార్ట్కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారికంగా పంపిణీ చేసిన తర్వాత.. జిల్లాల వారీగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 8.39 లక్షలు, రంగారెడ్డిలో 6.53 లక్షలు, మేడ్చల్లో 6.49 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. తొలివిడతగా మండలానికి వెయ్యి చొప్పున అందజేసి, మిగతా కార్డులను డీలర్ల ద్వారా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం గ్రేటర్లో 21.41 లక్షల మందికి స్మార్ట్కార్డులు అందనున్నట్లు వారు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande