
ఆదిలాబాద్, 15 ఆగస్టు (హి.స.)
ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలలోని అత్యంత వెనుకబడిన, మారుమూల గిరిజన గూడేలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఐటీడీఏ (ITDA) ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. దాదాపు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ శాశ్వత బీటీ రోడ్ల ద్వారా వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అనేక గ్రామాలకు రవాణా సులువవుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా ఈ రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమని, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఇవాళ ఉదయం అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi