
అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
: ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం కానున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. 30 ఏళ్లపాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ (ఐఎన్ఎస్ డేగ) సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్క్రాఫ్ట్లు ఇక్కడి నుంచి నడుస్తాయని.. నాన్షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలూ కొనసాగుతాయని పేర్కొంది. ఇప్పటి వరకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్కోడ్ ‘వీటీజెడ్’ ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ