ఆటోడ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ .. రూ.1.5 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు.. తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది.
Revanthreddy


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు.. తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో CURE ప్రాంతంలో 18,766 ఆటోలకు ప్రయోజనం కలగనుంది.

రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఈవీ ఆటోల కొనుగోలుకు రూ.1.5 లక్షల సాయం అందజేయనుంది. ఆటో రిక్షాలను ఈవీలుగా మార్చి ఈ పథకానికి రూ.200 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించనుంది. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణతోపాటు.. ఆటో డ్రైవర్ల ఇంధన వ్యయం తగ్గింపు లక్ష్యంగా ఈ పథకాన్ని తెంగాణ సర్కార్ అమలు చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande