
అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో భాగంగా ఏపీసీఆర్డీఏ (APCRDA) అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పుచేర్పులు మరియు ల్యాండ్ పూలింగ్ (భూసేకరణ) ప్రక్రియకు సంబంధించిన తుది గడువులను ఖరారు చేసేందుకు ఈరోజు ఉదయం తుళ్లూరు మరియు మంగళగిరి పరిధిలోని పలు గ్రామాల్లో అధికారికంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్లాట్ల కేటాయింపులు, అంతర్గత రహదారుల నిర్మాణం మరియు మౌలిక వసతుల కల్పనపై ఈ సభల్లో రైతులతో అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు త్వరలోనే అన్ని రకాల పెండింగ్ కౌలు నిధులు విడుదల చేస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ ఉదయం జరిగిన సభలకు రైతుల నుంచి భారీ స్పందన లభించడంతో రాజధాని ప్రాంతంలో మళ్లీ ల్యాండ్ మార్కెట్ ఊపందుకుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi