
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) భాగ్యనగరంలో వినాయక చవితి (Vinayaka Chaviti) సందడి నెల రోజుల ముందు నుంచే నెలకొంది. ఇప్పుడు అంతా గణేశుడి విగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నాగోల్లోని తిరంగ్ యూత్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తోంది. గత పదేళ్లుగా ఈ అసోసియేషన్ మట్టి విగ్రహాన్నే (Eco Friendly) ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 అడుగుల భారీ మట్టి గణపతిని తయారు చేయిస్తున్నారు.ఇక ఖైరతాబాద్ వినాయకుడిని కూడా తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ సారి మరింత ఆకర్షణీయంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు జరగబోతున్నాయడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్