విజయసాయిరెడ్డి పై దాడి జరిగింది నిజం..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
విజయసాయిరెడ్డి పై దాడి జరిగింది నిజం..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
విజయసాయిరెడ్డి పై దాడి జరిగింది నిజం..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

తనపై భౌతిక దాడి జరిగిందంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్రువీకరించారు. 2022లో మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై దాడి చేశారని, ఈ విషయం అధినేత జగన్‌కు తెలిసినా ఆయన ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయిరెడ్డి ఇటీవల ఓ బహిరంగ లేఖలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సజ్జల నేరుగా స్పందించనప్పటికీ, అప్పట్లో వైసీపీలో ఉన్న కోటంరెడ్డి ఈ ఘటనపై స్పందించి కీలక విషయాలు బయటపెట్టారు.

మంగళగిరి ప్లీనరీలో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే అంశంపై విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని కోటంరెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే స్టేజీ పక్కన ఉన్న రెస్ట్‌రూమ్‌లోకి విజయసాయిరెడ్డిని తీసుకెళ్లిన సజ్జల, ఆయన చొక్కా పట్టుకుని కొట్టారని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే, విజయసాయిరెడ్డి ఎందుకో తిరిగి దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో విజయసాయిరెడ్డి ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి పేర్కొన్నట్లుగానే ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande