
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు’ అని పేర్కొంది. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ