'శుద్ధీకరణ' ఘటనలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలి......జేపీ నడ్డాకు మల్లికార్జున ఖర్గే లేఖ
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన 'శుద్ధీకరణ' ఘటనలో పాల్గొన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ నేత జేపీ నడ్డాకు లేఖ రాశారు.
Mallikarjun Karge


ఢిల్లీ , 03 సెప్టెంబర్ (హి.స.) ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన 'శుద్ధీకరణ' ఘటనలో పాల్గొన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ నేత జేపీ నడ్డాకు లేఖ రాశారు.

లేఖలో ఘటనలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ఆదేశించాలని నడ్డాను కోరారు. శుద్ధీకరణ అంశం కేవలం తన వ్యక్తిగతమో, కాంగ్రెస్కు సంబంధించనదో కాదన్నారు. ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంగా అభివర్ణించారు.

ఈ ఘటన జరిగి 24 రోజులు గడిచినప్పటికీ, ఇందులో పాల్గొన్న సంస్థలు, వ్యక్తులపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం పట్ల ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోజూ ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. ఇలాంటి తప్పులు చేసేవారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande