అదృశ్యమైన బాలుడి కథ
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అ
అదృశ్యమైన బాలుడి కథ


హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అన్వేష్ (6) విగతజీవిగా మారాడు. ఇంటికి సమీపంలోని చెరువులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

రాజేంద్రనగర్ పరిధి హైదరగూడ సిరిమల్లె కాలనీకి చెందిన శివశంకర్, అపర్ణ దంపతుల చిన్న కుమారుడు అన్వేష్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగిన బాలుడు.. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టు పక్కల ఆరా తీసినా ఆచూకీ తెలియలేదు. కిందికి వచ్చిన సమయంలో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? నడుచుకుంటూ వెళ్లి తప్పిపోయాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పరిసరాల్లోని సీసీ కెమెరాల సాయంతో బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరికి చెరువులో బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


 rajesh pande