ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 400 కొవిడ్ కేసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 కొవిడ్ కేసులు ని
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 400 కొవిడ్ కేసులు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,343కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 516 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,44,132 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 5,102 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తురు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande