రాజంపేట: ఇటీవల కడప జిల్లాలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదల్లో రాజంపేట మండలంలో 38 మంది గల్లంతు అయినట్లు మన్నూరు ఎస్ఐ భక్త వత్సలం తెలిపారు. ఇప్పటి వరకు 25 మృతదేహాలు గుర్తించామన్నారు. గల్లంత్తైన 13 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ఎస్ఐ వివరించారు. వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల రాయలసీమ జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల వల్ల కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయ. ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హిందుస్థాన్ సమాచార /నాగరాజ్