, అమరావతి:26 ఏప్రిల్ (హిం.స) గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఎంత పోరాడినా జనం మాత్రం రాలేదు. గత ఐదేళ్లుగా గుడివాడలో నాని చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడమే దీనికి కారణం. జనానికి మంచినీటి అవస్థలు, రహదారులపై వెతలు కనీస స్థాయిలోనూ నాని పరిష్కరించలేకపోయారు. ఆయన ప్రచారానికి వెళితే.. నిలదీతలు తప్ప.. ఎక్కడా స్వాగతాలు లేవు. అందుకే.. సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ హారతులిప్పించుకోవడం, పూలు చల్లించుకోవాల్సి వస్తోందని.. వైకాపా నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాని గురువారం వేసిన నామినేషన్ కూడా జనాలు కరవై.. పేలవంగా మారింది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్