రాయచోటి, ఏప్రిల్ 26 ఏప్రిల్ (హిం.స): అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు) స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ఎన్నికల్లో వైసీపీని(YCP) చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు.
అప్పుడు జగన్రెడ్డి డ్రామా కంపెనీ వైసీపీని మూసేసి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాగళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన, జనసేనాని పవన్ కల్యాణ్, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరి ఆస్తులను దోచేస్తాడని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. టీడీపీ హయాంలో మద్యం క్వార్టర్ బాటిల్ ధర రూ.60 ఉండేదని.. అది ఇప్పుడు రూ.200 అయిందని.. పెరిగిన రూ.140 మంత్రి పాపాల పెద్దిరెడ్డి ద్వారా తాడేపల్లె ప్యాలె్సకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. గాడితప్పిన రాష్ట్రాన్ని బాగుచేయాలనే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. పొత్తులవల్ల లాభనష్టాలు బేరీజు చేసుకోకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. కూటమి పొత్తు కు అదే నాంది’ అని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు గానీ, కిరణ్కుమార్రెడ్డి ఉన్నప్పుడు గానీ ముస్లింలకు అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వారిలో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని వైసీపీ చూస్తోందన్నారు. ఇంకా ఏమన్నారంటే..
హిందూస్తాన్ సమాచార రాజీవ్