మిథాలీ రాజ్ మరో రికార్డు
ఢిల్లీ, 21 సెప్టెంబర్ (హిం.స) భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును స
మిథాలీ రాజ్ మరో రికార్డు


ఢిల్లీ, 21 సెప్టెంబర్ (హిం.స) భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేలకు పైగా పరుగులు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఘనత సాధించింది. ఆస్రేలియాలో జరగుతున్న మ్యాచ్ లో మిథాలీ 61 పరుగులు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.అయితే అనంతరం ఆస్రేలియా టార్గెట్ ను 41 ఓవర్లలో చేధించింది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande