ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ శివలింగయ్య
తెలంగాణ: జనగామ: ఫిబ్రవరి 4 (హిం.స) జనగాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటి
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ శివలింగయ్య


తెలంగాణ: జనగామ: ఫిబ్రవరి 4 (హిం.స) జనగాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవిఎం)లను భద్రపరిచిన గోదామును జనగాం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తనిఖీ చేశారు.

శనివారం జనగామ, స్టేషన్ ఘనపూర్ ఈఆర్వో లు సిహెచ్. మధుమోహన్, కృష్ణవేణి, ఎన్నికల పర్యవేక్షకులు పి. శ్రీనివాస్ తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు.

భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్రప్రభుత్వ సూచనల మేరకు నెలవారి సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవిఎంలు భద్రపరచిన గోడౌన్ లో పోలీస్ భద్రత, సిసికెమెరాలు, లైటింగ్, కావలసిన ఇతర రక్షణ సదుపాయాలు, తదితర విషయాలను తనిఖీ చేసిన్నట్లుతెలిపారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande