స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వని సంస్థకు చెందిన నేతలు దేశభక్తి గురించి మాట్లాడడం తగదు-కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం-
ఢిల్లీ, 18మార్చి (హిం.స):రాహుల్ గాంధీపై భాజపా అధ్యక్షుడు నడ్డా విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిక
స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వని సంస్థకు చెందిన నేతలు దేశభక్తి గురించి మాట్లాడడం తగదు-కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం-


ఢిల్లీ, 18మార్చి (హిం.స):రాహుల్ గాంధీపై భాజపా అధ్యక్షుడు నడ్డా విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, ఆప్తమిత్రుడి కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వని సంస్థకు చెందిన నేతలు దేశభక్తి గురించి మాట్లాడడం తగదన్నారు. జాతివ్యతిరేకులైన ఆ వ్యక్తులు ఇతరులను దేశద్రోహులని అంటున్నారని ఆక్షేపించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో నరేంద్ర మోదీయే దేశ ప్రజలను చులకనచేసి మాట్లాడారని ఖర్గే ట్వీట్లలో పేర్కొన్నారు. అందుకు భాజపా నేతలే క్షమాపణలు చెప్పాలన్నారు. భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవాలని విదేశాలను రాహుల్ గాంధీ ఏ సమయంలోనూ కోరలేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ‘ఇండియాటుడే కాంక్లేవ్’లో ఆయన మాట్లాడారు.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande