ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి నామినీ అజయ్ బంగాకు కరోనా పాజిటివ్
ఢిల్లీ, 24 మార్చి (హిం.స):న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి
 అజయ్ బంగా


ఢిల్లీ, 24 మార్చి (హిం.స):న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి నామినీ అజయ్ బంగాకు కరోనా పాజిటివ్ అని శుక్రవారం తేలింది ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెన్షియల్ నామినీ అజయ్ బంగాకు ఢిల్లీలో సాధారణ పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలినట్లు ట్రెజరీ శాఖ వెల్లడించింది. 63 ఏళ్ల బంగా భారత్లో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్లను కలవాల్సి ఉంది.

బంగా తన ప్రపంచ పర్యటన చివరి దశలో ఢిల్లీలో ఉన్నారు.భారత్లో గత రెండు వారాల్లో ఇన్ఫ్లుఎంజా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అజయ్ బంగాకు పాజిటివ్ వచ్చింది.అజయ్ బంగా యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు వెళ్లాల్సి ఉంది.అజయ్ బంగాలో కరోనా లక్షణాలు కనిపించక పోయినా, పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande