ఆంధ్రప్రదేశ్ 06 జూన్ (హిం.స) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది కేంద్ర సర్కార్.
ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంజూరైన రూ.12,911 కోట్లలో రూ. 2,000 కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండటం వల్ల జరిగిన అదనపు ఖర్చును కవర్ చేయడానికి కూడా నిధులు ఉన్నాయని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు రూ.12,911 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
హిందూస్తాన్ సమాచార ,రాజీవ్