శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు
అమరావతి, జూన్ 7 జూన్ (హిం.స) ఈ ఏడాది డిసెంబరుకల్లా పోలవరం తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్
శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు


అమరావతి, జూన్ 7 జూన్ (హిం.స) ఈ ఏడాది డిసెంబరుకల్లా పోలవరం తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.

అయితే... ఈ ఏడాది డిసెంబరు సంగతి పక్కనపెడితే, వచ్చే ఏడాది డిసెంబరుకూ పనులు కావని... 2025 జూన్ నాటికి చేయగలమని అధికారులు ఆయనకు తేల్చి చెప్పారు.

మంగళవారం వైఎస్ జగన్ పోలవరం హెడ్వర్క్స్ పురోగతిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande