పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య ఈరోజు జరిగే మహిళల టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్న భారత అభిమానులు
స్పోర్ట్స్, 14 అక్టోబర్ (హి.స.) మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ప్రధాన జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్ ఓడిపోయి
ఈరోజు మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలి.. భారత అభిమానులు


స్పోర్ట్స్, 14 అక్టోబర్ (హి.స.)

మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ప్రధాన జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్ ఓడిపోయి సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. గ్రూప్- ఏ పాయింట్ల పట్టికలో మొత్తం నాలుగు మ్యాచ్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరుకుంది. అలాగే నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు మాత్రమే గెలిచిన భారత మహిళల జట్టు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ రోజు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యచులో పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. అది కూడా తక్కువ మార్జిన్ తో మాత్రమే గెలవాలి. ఒకవేళ పాకిస్తాన్ జట్టు భారీ తేడాతో పాక్ గెలిస్తే.. పాక్ సెమీస్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా న్యూజిలాండ్ గెలిస్తే.. నేరుగా సెమిస్ చేరుకుంటుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మరీ ఈ మ్యాచులో పాక్ గెలిచి భారత్ను సెమీస్ కు పంపుతుందా.. లేఖ భారీ తేడాతో విజయం సాధించే పాకిస్థాన్ జట్టే.. నేరుగా సెమీస్ వెళ్తుందో తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకు వేచి చూడాల్సిందే మరి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande