సిద్దిపేట, 14 అక్టోబర్ (హి.స.)
పోలీస్ కమిషనరేట్ పరిధిలో
అక్టోబర్ 30వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ
ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు,ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు
నిర్వహించ కూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి
తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే
చట్టపరంగా చర్యలు
తీసుకుంటామన్నారు.
నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు
సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి
తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు అక్టోబర్ 30వ తేదీ వరకు అమలులో
ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై
చట్టప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ
హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..