రంగారెడ్డి జిల్లాలో గంజాయి ముఠా హల్ చల్
రంగారెడ్డి, 13 అక్టోబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లాలో గంజాయి ముఠా హల్చల్ చేశారు. తెల్లవారుజామున గంజాయి సేవించిన మత్తులో మార్నింగ్ వాకర్స్ పై దాడికి తెగబడ్డారు. ఘటన ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో ఓ ఐదుగురు సభ్యుల గ్
గంజాయి ముఠా అల్ చల్


రంగారెడ్డి, 13 అక్టోబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లాలో గంజాయి

ముఠా హల్చల్ చేశారు. తెల్లవారుజామున గంజాయి సేవించిన మత్తులో మార్నింగ్ వాకర్స్ పై దాడికి తెగబడ్డారు. ఘటన ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో ఓ ఐదుగురు సభ్యుల గ్యాంగ్ గంజాయి మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తున్న వారిపై దుర్భాషలాడుతూ కర్రలతో దాడి చేశారు. అంతేగాక ఈ దాడిని అడ్డుకోబోయిన స్థానికులను సైతం కర్రలతో కొట్టారు. పార్కింగ్ చేసి ఉన్న వాహానాల అద్దాలు ధ్వంసం చేస్తూ.. వీరంగం సృష్టించారు. వీరంతా గత కొద్దికాలంగా దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నారని, వచ్చే పోయే వారిని బూతులు తిడుతూ.. దాడికి తెగబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కుటుంబంతో బయటికి రావాలంటే భయంగా ఉందని, పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేగాక ఈ గంజాయి ముఠా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులు చొరవ తీసుకొని గంజాయి గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande