రంగారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మనోహర్ రావు ఫామ్ హౌస్ లో బుధవారం వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అడిషనల్ డీసీపీ వెంకట సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్
దారుణ హత్య


హైదరాబాద్, 16 అక్టోబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మనోహర్ రావు ఫామ్ హౌస్ లో బుధవారం వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అడిషనల్ డీసీపీ వెంకట సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా ముష్టిపల్లికి చెందిన ఉషయ్య (70), శాంతమ్మ (65) దంపతులు రెండు సంవత్సరాల నుంచి మనోహర్ రావు పొలంలో కాపలదారులుగా పనిచేస్తున్నారు.

మంగళవారం సాయంత్రం మనోహర్ రావు ఉషయ్యతో ఫోన్ మాట్లాడాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో మనోహర్ రావు ఉషయ్యకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడంతో మనోహర్ రావు తనకు తెలిసిన వ్యక్తిని పొలం దగ్గరకి వెళ్లి చూడమన్నాడు. అప్పటికే శాంతమ్మ, ఉషయ్యలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande