జోగులాంబ గద్వాల, 18 అక్టోబర్ (హి.స.)
ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ
బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
తో శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ అనంతరం స్వామి వారికి అభిషేకాలు
చేశారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అంతకుముందు హరిత టూరిజం హోటల్ లో జిల్లా కలెక్టర్ సంతోష్ పుష్పగుచ్చం ఇచ్చి
మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..