కాకినాడ, 20 అక్టోబర్ (హి.స.)
కాకినాడ జిల్లాలో కరెంటు వైర్లు తల్లీ
కొడుకుల ప్రాణాలు తీశాయి. జిల్లాలోని సామర్లకోటలోని వీర రాఘవపురం సత్తమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న చిట్టిమని పద్మ శనివారం కాలువ సమీపంలో మృతి చెందింది. ఆదివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఆమె కుమారుడు విశ్వేస్ కాలువలో స్నానం చేసి, దుస్తులు పక్కన ఉన్న తీగ మీద ఆరేయగా, కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా పద్మ కూడా నిన్న అదేవిధంగా మృతి చెంది ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే కరెంట్ షాక్ తో తల్లీ కొడుకులు మృతి చెందడంతో వీర రాఘవపురంలో విషాదం అలుముకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..